Unlock a World of Free Content: Books, Music, Videos & More Await!

ఆరోగ్యమే మహాభాగ్యము

Description
ఆహారచిట్కాలు
Advertising
We recommend to visit

"ఈ ఛానల్ లో...

❣ "ఆదివారం స్పెషల్ (పుస్తకాలు),
❣ విధ్య ప్రభ,
❣ సూర్య- ప్రజ్ఞ, నిపుణ,
❣ చిత్ర ప్రభ, సూర్యచిత్ర ,
❣ ఆంధ్రభూమి
❣ నవ్య వీక్లీ, మరియు
❣ స్వాతి,
❣ అన్ని రకాలు వార పత్రికలు"ఉంటాయి..

👇All Telugu Papers👇

Join🔜 @Venkyepapers

Indian Film Production House

Last updated 5 months, 3 weeks ago

🎯Daily Job Update Telugu🎯

▒☞📃 డైలీ జాబ్ నోటిఫికేషన్స్.

▒☞📔 జికే & కరెంట్ అఫైర్స్.

▒☞📚 మేగజైన్స్ & బుక్స్.

▒☞✒ విద్యా & ఉద్యోగా సమాచారం.

Last updated 2 years, 11 months ago

1 month ago

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..

1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.

2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .

3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.

4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.

5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.

6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.

7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.

8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.

9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.

ప్లేట్లెట్స్ అంటే ఏమిటి ?

సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.*

ఈ ఉపయోగకరమైన సమాచారం మీ బంధువులకి,మిత్రులకి షేర్ చేయండి.

ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Hanmonthrao panthulu
9949363498

1 month, 1 week ago

మధుమేహం -
షుగర్ /sugar
సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం
#########################
ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది.
—ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు.
—దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది.
—శరీరంలో మంటలు, తిమ్మిరులు రానివ్వడు
–షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది.
—వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు.
—-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది.
—-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది.
—-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది.
-మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును.
—టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును.
—చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.
—LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును.
“జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును
ఈ చూర్ణంవాడుతుంటే  షుగర్ వల్ల బాధలు ఉండవు

పొడపత్రి ఆకు
నేలవేము సమూలం
తిప్పతీగ లావుది
మానుపసుపు బెర డు
నేరేడు గింజలు
మోదుగపువ్వు,
లోద్దుగ బెరడు,
వేగిస బెరడు
నేలతంగేడు,
మారేడు,
ఉసిరి
నల్లజిలకర
కలోంజీ
కటుకరోహిణి
మెంతి,
సప్తరంగి
ఒద్ది బెరడు
శిలాజితు
వంగభస్మము

Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి.
సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి
🏀సూచన:
మీరు  తయారుచేసుకోలేనప్పుడు.
మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 310 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము.
1200+100 courier for one month

❤️❤️❤️❤️❤️🍀🍀❤️❤️❤️❤️❤️
ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు  "9949363498  కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను

1 month, 2 weeks ago

మగధీర    అమిత బలానికి
######################
1)  తుమ్మజిగురు       10గ్రా
2) బూరుగ జిగురు      10గ్రా
3)మోదుగ జిగురు       10గ్రా
4) నేలతాడి                 10గ్రా
5) నేలగుమ్మడి            10గ్రా
6) అతిమదురం            10గ్రా
7) పల్లెరు        10గ్రా
8)అశ్వగంధ.     10గ్రా
9) శతావరి             10గ్రా
10,   జాజికాయ       10గ్రా
11,సఫెదముస్లి       10గ్రా
12, సాలం మిశ్రీ.     10గ్రా
13, సాలం పంజా  10గ్రా
14,  సాలం గట్టా.   10గ్రా
15, అక్కలకర్ర.     10గ్రా
16,  కోకిలాక్ష.        10 గ్రా
17,బల విత్తులు   10 గ్రా
18, దూలగొండి విత్తులు. 10 గ్రా
ఈ అన్ని   మంచి నాణ్యమైనవి పుచ్చులు లేనివి మూలికలు సమానంగా తీసుకొని, ఒక మట్టిపాత్రలొ లెదా స్టీల్ పాత్రలో వేసి,  పై వస్తువులు మునిగె వరకు నాటు  ఆవుపాలు పోసి  ఇలా రాత్రి నానబెట్టి  ఉదయం ఎండలో ఎండించాలి,
ఇలా పై విదంగా రాత్రి నానబెట్టి  పగలు ఎండవేయవలెను, ఇలా 7 రోజులు వరుసగా ఖచ్చితంగా చేయాలి, ఇలా చేసి ఆ తర్వాత బాగా ఎండించి, దంచి జల్లించి  గాజు సీసాలొ బద్రపరుచుకొని రోజు ఉదయం ఒక స్పూన్   రాత్రి  స్పూను బోజనానికి అర్ద గంట ముందు గోరు వెచ్చని నీటితో   తీసుకోవాలి.
అద్బుతమైన శక్తికి , శీఘ్రస్కలనానికి,  అంగము గట్టిపడుటకు, శుక్రకణాల వృద్ధికి, కండపుష్టికి,ఎముకల పటుత్వానికి దేహదారుడ్యానికి  అతిగా ఇంగ్లీష్ మందులు ( వయాగ్రా) వాడి వళ్ళు  గుల్ల చేసుకొన్న వారికి 
మీ సమస్య తీరుతుంది, స్త్రీలు సంతృప్తి  చెందుతారు. మీ జీవతం సుఖవంతంగా సాగుతుంది,
మీ శృంగార  శక్తి చాలా గొప్పగా అవుతుంది.
అనుభవమైనది  ఎందరో వాడినారు,వాడుతున్నారు.లాభం పొందుతున్నారు

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
తయారుచేసింది మావద్ద ఉంది speed. post / courier ద్వారా పంపగలము
1200 నెలకు
3200 స్వర్ణభస్మం కలిసింది
100 పోస్టేజ్ extra
K.Hanmanthrao panthulu
cell.9949363498:

3 months ago

1.రోజుకు రెండు కరివేపాకు రెమ్మలు తింటే ఒబేసిటి రాదు. పచ్చి కూరగాయల సూపు తాగినా ఫలితం ఉంటుంది.
2.కలమంద గుజ్జులో పసుపు కలిపి పరిగడుపున తీసుకుంటే మార్పు కనిపిస్తుంది.

అలసట:

1.రోజువారీ జీవితంలో అందరూ ఎదుర్కొనే సమస్య అలసట. దీనిని అధిగమించేందుకు ద్రాక్షపండ్లు రాత్రి నీళ్ళలో నానబెట్టి పొద్దున తినాలి.
2.అలాగే, ఖర్జూర పండ్లను కూడా రాత్రి నీళ్ళలో నానబెట్టి తింటే చాలా మంచిది.
3.బాదం పాలు కూడా అలసటను దూరం చేస్తాయి.

నెలసరి నొప్పి:

1.స్త్రీలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఇదొకటి. ఉత్తరేణి రసం రోజూ చెంచా చొప్పున మూడు రోజులు పరికడుపున తీసుకుంటే ముట్టు నొప్పి తగ్గిపోతుంది.
2.టీ డికాషన్‌లో నిమ్మరసం పిండుకుని తాగినా ఉపశమనం కలుగుతుంది.
3.రేలకాయ గుజ్జు చూర్ణం చేసి గోరు వెచ్చటి నీటిలో కలుపుకుని తాగితే నొప్పి తగ్గడమే కాదు, నెలసరి క్రమపడుతుంది.

తలనొప్పి:

1.పొద్దున లేవగానే రాగి చెంబులో నిల్వ ఉంచిన నీళ్ళను తాగడం వల్ల తలనొప్పి రాదు. ఉన్న నొప్పి కూడా మటుమాయం అవుతుంది.
2.ఒక చెంచాడు మెంతులు రాత్రి నీళ్ళలో నానబెట్టి పొద్దున తాగాలి. ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల వాతంతో వచ్చే తలనొప్పి తగ్గుతుంది.

నడుం నొప్పి:

1.రాత్రి పడుకునే ముందు వేడినీటిలో ఆముదం కలిపి తీసుకోవాలి. ఉదయం సుఖవిరేచనం అయి నడుం నొప్పి తగ్గుతుంది.
2.రస కర్పూరం, నల్లమందు, కొబ్బరి నూనెలో కలిపి నడుంకు రాస్తే ఫలితముంటుంది.

బట్టతల:

1.సీతాఫలం ఆకులు నూరి మేక పాలలో కలిపి తలకు రాస్తుండాలి. ఇలా చేయడం వల్ల బట్టతల తగ్గే అవకాశం ఉంది.
2.గురిగింజ ఆకురసం నువ్వుల నూనెలో కలిపి వేడి చేసి తలకు రాసుకున్నా బట్టతల తగ్గే అవకాశం ఉంది.

కీళ్ళ నొప్పులు:

1.నొప్పి ఉన్న కీలుపై జిల్లేడు ఆకు వేడి చేసి కట్టాలి.
2.మిరియాలు, బియ్యం రెండింటిని బాగా నూరి నొప్పి ఉన్న చోట కట్టు కడితే తగ్గుతుంది.
3.ఆహారంలో ఉల్లిపాయలు ఎక్కువగా ఉండేట్లు జాగ్రత్తపడ్డా కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

గుండె జబ్బులు:

1.మంచి తేనె గోరు వెచ్చని నీళ్ళలో కలుపుకుని తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల గుండె జబ్బులు మీ దరిచేరవు.
2.దానిమ్మ, పచ్చి ఉసిరికాయ రసం తాగినా కూడా హదయానికి ఎంతో మేలు చేస్తుంది.
3.మన ఆహార నియమాలతోనే గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకే, కొవ్వు పదార్థాలు, నూనెలు తగ్గించడం చాలా మంచిది

3 months ago

2.అరటిపండ్లు ప్రతి రోజు ఉదయం తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని అధిగమించవచ్చు.
3.ధనియాల కషాయంలో ఉప్పు కలిపి కొద్ది రోజులు తీసుకున్నా లేదా మెంతుల కషాయం తాగినా మంచి ఫలితముంటుంది.
4.వెల్లుల్లి రసాన్ని 15 రోజులపాటు తీసుకున్నా అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది.
5.కామంచి గింజల చూర్ణం కషాయం కాచి తాగినా అతిమూత్రం తగ్గుతుంది. అంతేకాదు, మధుమేహం వ్యాధి కూడా అదుపులో ఉంటుంది.
6.మర్రిచెక్క కషాయం లేదా మెంతుల కషాయం క్రమం తప్పకుండా తీసుకున్నా మంచి ఫలితముంటుంది.

తల వెంట్రుకలు పెరుగడానికి

1.మందార పువ్వులు,మైదాకు, కలమంద గుజ్జు, నల్ల నువ్వుల నూనెలో వేసి కాచి వడబోసి తలకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు నల్లగా పెరగడమే కాదు తలనొప్పి కూడా తగ్గుతుంది.
2.కరివేపాకు రసం, వెల్లుల్లి పొట్టు నల్ల నువ్వుల నూనెలో కాచి పెట్టుకున్నా వెంట్రుకలు పెరుగుతాయి.
3.గుంటగలగర ఆకురసం నువ్వుల నూనెలో వేడి చేయాలి. తర్వాత తలకు పట్టిస్తే వెంట్రుకలు నల్లగా, వొత్తుగా పెరుగుతాయి.

ఉబ్బసం:

1.తెల్ల జిల్లేడు పువ్వుల చూర్ణాన్ని బెల్లంతో కలిపి తింటే ఉబ్బసం తగ్గుతుంది.
2.అడ్డసరం ఆకులు ఎండబెట్టి చూర్ణం చేయాలి. అందులో శొంఠి, మిరియాల చూర్ణాలు కలిపి దానిలో తిప్పతీగ రసంతో మాత్రలు తయారు చేసి వీటిని ఇరవై రోజులు వాడితే ఎంత ఉబ్బసం, ఆయాసం ఉన్నా తగ్గుతాయి.
3.వెల్లుల్లి రసం వేడి నీళ్లలో వేసి తాగినా లేదా మిరియాల చూర్ణం తేనెలో కలిపి సేవించినా ఫలితముంటుంది.
4.నేపాల గింజలు నిప్పుల మీద వేసి ఆ పొగ పీలిస్తే ఉబ్బసం తగ్గుతుంది.

గుండెజబ్బులు:

1.తేనె వేడి నీళ్లలో కలిపి తాగితే గుండె జబ్బులు దరిచేరవు.
2.మద్ది చెక్క (తెల్లది) యష్టిమధుక చూర్ణాలను కలిపి నీళ్లలో కలుపుకుని తాగితే గుండె జబ్బులను నివారించవచ్చు.
3.స్వచ్ఛమైన తేనె అంటే వేప చెట్టుకు పెట్టిన తేనె తుట్టె నుంచి తీసింది.
4.మనం తీసుకునే ఆహారం వల్లే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది కనుక ఈ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు, నూనెలు తగ్గించాలి.

ఎసిడిటీ:

1.ఎసిడిటీకి దూరంగా ఉండాలనుకుంటే వేపుడు కూరలు, మసాలాలతో చేసిన వంటకాలను మానేయాలి.
2.పచ్చబొట్టు ఆకు, నాగదమని ఆకు రెండూ కలిపి దంచిన ముద్దను తిన్న తరువాత గ్లాస్ నీళ్ళు తాగితే ఎసిడిటీ తగ్గుతుంది.
3.దానిమ్మ రసం తీసుకుంటే ఎసిడిటీ రాదు. ఒకవేళ ఉన్నా తగ్గుతుంది. రోజూ అరటి పండు తిన్నా ఫలితముంటుంది.
4.అల్లం ముక్క వేసిన పాలను బాగా మరిగించి తాగితే చక్కని ఫలితముంటుంది.
5.ఈ సమస్యతో బాధపడుతున్న వారు తరచూ మంచి నీళ్ళు తాగుతుండాలి.

ఆకలి పుట్టడానికి:

1.అల్లం ముక్కలు, సైందవ లవణం కలిపి భోజనానికి ముందు నమిలి ఆ రసాన్ని మింగితే ఆకలి పుడుతుంది.
2.మిరియాల చారుతో అన్నం తింటే ఆకలి లేదు అన్న సమస్యే రాదు.
3.నేపాళ గింజల చూర్ణం, జీలకర్రను చక్కెరతో కలిపి తీసుకుంటే జీర్ణశక్తి పెరిగి ఆకలి పుడుతుంది.
4.ఉత్తరేణి బియ్యం, మేకపాలలో కలిపి నూరి మాత్రలుగా చేసి పాలతో తీసుకుంటే ఆకలి ఆధిక్యాన్ని తగ్గించవచ్చు.

అధిక రుతుస్రావం:

1.ఉసిరికాయ, కరక్కాయ, రసాంజనం మూడింటినీ కలిపి చూర్ణం చేసి తాగితే నెలసరిలో అధికస్రావాలు తగ్గుతాయి.
2.ఇంటి ముందు అందం కోసం పెంచుకునే ఎర్రమందారం పువ్వులు కూడా ఆరోగ్య ప్రదాయనిగా పనిచేస్తాయి. ఈ పవ్వుల కషాయం తాగినట్లయితే అధిక రక్తస్రావం తగ్గిపోతుంది.

కడుపు ఉబ్బరం:

1.ఒక గ్రాము సైందవ లవణం, 5 గ్రాముల అల్లం కలిపి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
2.అన్నం తిన్న తర్వాత వాము, ఉప్పు కలిపి తీసుకున్నా ఈ సమస్యను అధిగమించ వచ్చు.

తలవెంట్రుకలు ఊడిపోకుండా

1.ఉసిరి రసం, గుంట గలగర రసం కొబ్బరినూనెలో కలిపి వేడి చేసి తలకు రాయడం వల్ల వెంట్రుకలు రాలవు.
2.తల వెంట్రుకలకు కొబ్బరి నూనెలో కలమంద గుజ్జు కలిపి వేడి చేసి రాయాలి. ఇది వెంట్రుకలు రాలడాన్ని అరికడుతుంది.
3.బాధం, కరక్కాయ నూనె రాసినా కూడా మంచి ఫలితముంటుంది.

దంత సమస్యలు:

1.నల్ల నువ్వులు తిని వెంటనే నీళ్ళు తాగితే కదులుతున్న దంతాలు గట్టి పడుతాయి.
2.వేపపుల్లతో పండ్లు తోమినా దంతాలు పటిష్టంగా ఉంటాయి.
3.జిల్లేడు పాలను నొప్పి ఉన్న పన్నుపై వేస్తే పంటి నొప్పి తగ్గుతుంది.

కాళ్ళ పగుళ్ళు:

1.పసుపు, నువ్వుల నూనె కలిపి రాస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి.
2.మెంతులు, మైదాకు కలిపి రుబ్బి పెట్టుకుంటే త్వరగా నయమవుతుంది.
3.మర్రిచెట్టు పాలు పట్టి వేసినా చక్కని ఫలితం ఉంటుంది.
4.త్రిఫలచూర్ణం వాడితే పగుళ్ళు రావు.

అజీర్ణం:

1.రోజూ రెండు కప్పుల పెరుగు తింటే అజీర్ణం రాదు.
2.ఉల్లిగడ్డను కాల్చి కొంచెం ఉప్పు కలిపి మెత్తగా నూరి తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది. ఇలా రోజుకు ఒక్కసారి వారం రోజులు చేస్తే మరీ మంచిది.
3.జీలకర్ర కషాయం తాగితే అజీర్ణపు కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
4.నేల తంగెడు చూర్ణం 1 లేదా 2 చెంచాలు అల్లం రసంతో కలిపి తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

అతి బరువు (ఊబకాయం):

3 months ago

గృహ వైద్యం:-

నోట్:- పనిలేక కాలక్షేపం కోసం మరియు పబ్లిసిటీ కోసం చేసిన పోస్ట్ కాదు. మీ ఆరోగ్యం కోసం ఎంతో విలువైన సమయం కేటాయించి చేయడం జరిగింది. కొంచెం ఓపిక పెట్టి మొత్తం చదివి వినియోగించుకోండి. మీ బంధు మిత్రులకి షేర్ చేయండి.

వైద్య రంగంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నప్పటికీ ఆయుర్వేదానికి ఉన్న ప్రాధాన్యం తగ్గడంలేదు. వ్యాధి తగ్గడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా ఆయుర్వేదంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

శ్వాసకోశ వ్యాధులు:-

1.జిల్లేడు మొగ్గను కషాయం బెట్టి అందులో తాటి బెల్లం కలిపి వరుసగా ఏడు రోజులు వాడితే దగ్గు-దమ్ము తగ్గుతాయి.
2.మిరియాల కషాయం లేదా అల్లం రసం తేనెతో కలిపి సేవించినా శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి.
3.అడ్డసరం ఆకు కషాయం రోజు చెంచాడు తీసుకున్నా లేదా మద్దిచెక్క చూర్ణం పాలలో కలుపుకుని తీసుకున్నా ఫలితముంటుంది.
4.సర్పాక్షి వేరును చూర్ణం చేసి అల్లం రసంలో కలిపి తీసుకుంటే క్రమంగా దగ్గు-దమ్ము తగ్గుతాయి.

రక్తహీనత:

1.నీడలో ఎండబెట్టిన సరస్వతి ఆకు చూర్ణం, చిటికెడు మిరియాల చూర్ణం, ఆవుపాలతో కలిపి సేవించాలి. క్రమంగా రక్తవృద్ధి జరుగుతుంది.
2.నీడలో ఎండబెట్టిన ఉసిరి చూర్ణాన్ని ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు రెండు చెంచాలు తినాలి.
4.విటమిన్ బి లోపం వల్ల రక్తహీనత కలిగిన వాళ్ళు గలిజేరు ఆకును కూర లేదా పచ్చడిగా తీసుకుంటే మంచి ఫలితముంటుంది.
5.విష్ణుకాంత సమూలం నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. దానిని పాలతో కలిపి తీసుకుంటే రక్త క్షీణత తగ్గుతుంది.

మూర్ఛ:

1.తులసి ఆకురసం సైందవ లవణంతో కలిపి 1 లేదా 2 చుక్కలు వేస్తే స్పృహ వస్తుంది.
2.పసుపు పొడి పొగ వేసినా మూర్చ నుండి మెలకువ వస్తుంది.
3.తరచుగా పిల్లల్లో వచ్చే మూర్ఛవ్యాధులకు వస కషాయంతో స్నానం చేయించాలి.
4.కమ్మగగ్గెర ఆకును ఎండించి చూర్ణం చేసి నస్యంగా వాడాలి.
5.మూర్ఛవ్యాధి ఉన్న వ్యక్తికి 5 లేక 6 చుక్కల వావిలాకు రసం ముక్కులో వేస్తే ఫలితముంటుంది.
6.సీతాఫలం ఆకులు నలిపి వాసన చూపితే మూర్ఛ వ్యక్తికి మెలుకువ వస్తుంది. లేదా ఉల్లి రసం ముక్కులో వేసినా మంచి ఫలితం ఉంటుంది.

తెల్లమచ్చలు:

1.వేపకాయలు, ఆకులు, పువ్వులు సమానంగా కలిపి మెత్తగా నూరుకోవాలి. దీనిని రోజుకు రెండుసార్లు అరతులం చొప్పున తింటే నలభై రోజుల్లో తెల్లమచ్చలు తగ్గుతాయి.
2.పిచ్చి కుసుమ ఆకుల రసాన్ని తులసి ఆకుల రసంతో కలిపి మచ్చలు ఉన్నచోట రాయడం వల్ల క్రమంగా అవి తగ్గుముఖం పడుతాయి.
3.తంగేడు చెట్టు పట్టను ఆవుపాలలో దంచి తెల్లమచ్చల మీద రాస్తే తగ్గుతాయి.

నిద్రలేమి:

1.శతావరి చూర్ణం, బెల్లంతో కలిపి తింటే చక్కని నిద్ర వస్తుంది.
2.కలమంద నూనె తలకు మర్దన చేయాలి లేదా మోది చూర్ణం, బెల్లంతో కలిపి తిన్నా సుఖనిద్ర వస్తుంది.
3.మరాటి మొగ్గ పొడి చేసి పాలలో కలిపి పడుకునే ముందు తాగాలి. అలాగే, వేడి పాలు తాగినా సుఖనిద్ర వస్తుంది.

నోటి సమస్యలు:

1.లవంగాలు, యాలకులు నోటిలో చప్పరిస్తూ నమిలి మింగితే నోటి దుర్వాసన పోతుంది.
2.వెలగ ఆకు రసంలో నిమ్మ ఉప్పు కలిపి పుక్కిలించాలి.
3.పల్లేరు ఆకు రసం, తేనె కలిపి పుక్కిలించినా ఫలితం ఉంటుంది.
4.నోటి పూతను సులువుగా తగ్గించుకోవచ్చు. జామ ఆకులను నమిలి ఉమ్మివేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేస్తే తగ్గిపోతుంది.
5.లేత నేరేడు ఆకు కషాయం పుక్కిలించినా నోటి పూత తగ్గిపోతుంది.
6.గొబ్బి ఆకు (ముళ్ళ గోరింట) ఆకు నమిలి ఉమ్మేయాలి. అలాగే, పల్లేరు రసంలో తేనె కలిపి పూసినా నోటిపూట ఇట్టే తగ్గిపోతుంది.

తల తిప్పటం:

1.అల్లం, ఉప్పు కలిపి పొద్దున తింటే తగ్గుతుంది.
2.10 గ్రాముల అల్లం, 10 గ్రాముల బెల్లం దంచి ముద్ద చేసి నోట్లో పెట్టుకోవాలి. దాని నుండి వచ్చే ఊటను మింగాలి. ఇలా వారం రోజులు చేస్తే తల తిప్పుట తగ్గిపోతుంది.
3.మునగ ఆకులు మిరియాలు కలిపి మెత్తగా నూరి తలకు పట్టువేస్తే తలదిమ్ము తగ్గుతుంది.

రక్తపోటు (బి.పి.):

1.సుగంధపాల, మారేడు కలిపి వాడితే బి.పి. అదుపులో ఉంటుంది.
2.మారేడు ఆకుల కషాయం రోజూ తాగాలి. లేదా రోజూ చెంచెడు కల్యమాకు రసం తాగినా రక్తపోటు నిలకడగా ఉంటుంది.
3.ఈశ్వరి వేరు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది.
4.కాచి చల్చార్చిన నీటిలో అల్లం రసాన్ని కలిపి పొద్దున్నే తాగితే బి.పి. అదుపులో ఉంటుంద.

మలబద్దకం:

1.అరటి పండు రోజూ ఉదయం పరిగడుపున తింటే మలబద్దకం పోతుంది.
2.రాత్రి పడుకునే ముందు వేడి నీటితో త్రిఫల చూర్ణం తీసుకుంటే ఫలితముంటుంది.
3.రోజూ రెండుపూటల కలబంద గుజ్జు తింటే వారం రోజుల్లో ఈ సమస్యను అధిగమించవచ్చు.

అతిమూత్రం నివారణకు:

1.నేరెడు గింజల చూర్ణం 40 రోజులు పొద్దున చెంచాడు పొడిని నీళ్లలో కలిపి తీసుకుంటే అతి మూత్రవ్యాధి అదుపులో కొస్తుంది.

3 months ago

,గుండె ,కిడ్నీ ,లివర్ టాక్సిన్స్

1,తెల్లగలిజెరువేర్లు100గ్రా
2,తిప్పతీగ100గ్రా
3,పాషాణ భేదివేర్లు100గ్రా
4,ఉలిమిరిచెక్క(వరుణ)100గ్రా
5,ఉత్తరేణి గింజలు 100 గ్రా
6,గోక్షుర 100గ్రా
7,అశ్వగంధ100గ్రా                
8,నేలఉసిరి 50గ్రా
9,అర్జున.  50గ్రా
10, సుగందిపాల50గ్రా
11,ఉసిరి50గ్రా
12,కరక్కాయ50 గ్రా
13,తానికాయ50గ్రా
అన్నింటిని సమముగా  చూర్ణించి
Teaspoon ఆహారానికి అరగంట ముందు 2 పూటలు త్రాగుతున్న
రక్తము గుండె  లివర్  కిడ్నీ లు శుభ్రపడతాయి

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
Ready recipe
K.HanmanthraoPanthulu
.cell.9949363498

3 months, 3 weeks ago
3 months, 3 weeks ago
5 months ago

అధికమైన ఆకలి కలుగును.

  1. ఆనెలను, పులిపిరులను హరించు చిట్కాలు

  2. జిల్లేడుపాలు, ఆముదము వీటిని సమభాగములుగా కలిపి: మర్దించి ఈ మిశ్రమమును ఆనెలకు పట్టించుచుండిన ఎడల ఆనెలు హరించును.

  3. ఉత్తరేణి చెట్టును కాల్చిన బూడిద, హరిదళము వీటిని సమభాగము లుగా నూనెతో నూఱి; లేపనము చేయుచున్న ఎడల ఆనెలను, పులిపిరులను హఱించును.

  4. జీడిమామిడి గింజల యందుండు చమురును తీసి, ఆ చమురును పులిపిరి కాయలమీద పూయుచుండిన పులిపిరి కాయలు ఊడిపోవును.

  5. ద్రాక్షపండ్లను ఆనెలకు పైపూత మందుగా వాడితే ఆనెలు తగ్గుతాయి.

  6. సున్నము, చవుడుమట్టి ఈ రెండింటినీ సమభాగములుగా కలిపి; కొంచెము నీటితో నూరి, పైనలేపనము చేయుచుండిన ఆనెలు హరించును.

We recommend to visit

"ఈ ఛానల్ లో...

❣ "ఆదివారం స్పెషల్ (పుస్తకాలు),
❣ విధ్య ప్రభ,
❣ సూర్య- ప్రజ్ఞ, నిపుణ,
❣ చిత్ర ప్రభ, సూర్యచిత్ర ,
❣ ఆంధ్రభూమి
❣ నవ్య వీక్లీ, మరియు
❣ స్వాతి,
❣ అన్ని రకాలు వార పత్రికలు"ఉంటాయి..

👇All Telugu Papers👇

Join🔜 @Venkyepapers

Indian Film Production House

Last updated 5 months, 3 weeks ago

🎯Daily Job Update Telugu🎯

▒☞📃 డైలీ జాబ్ నోటిఫికేషన్స్.

▒☞📔 జికే & కరెంట్ అఫైర్స్.

▒☞📚 మేగజైన్స్ & బుక్స్.

▒☞✒ విద్యా & ఉద్యోగా సమాచారం.

Last updated 2 years, 11 months ago